![]() |
![]() |

కితకితలు మూవీ ద్వారా బాగా ఫేమస్ ఐన నటి గీతాసింగ్. ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను బాడీ షేమింగ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నారు. ఐతే ఈమె బిగ్ బాస్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ఒక ఇంటర్వ్యూలో. "నా ఫాన్స్ అంతా అడుగుతున్నారు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్లడం లేదు అని. నాకు బిగ్ బాస్ లోకి వెళ్లడం అంటే ఇష్టం. అందరూ ఆడినట్టే ఆడతాను. స్క్రిప్ట్ ఇస్తారు కదా టాస్కులు ఆడమంటూ అలాగే ఆడతాను. ఆల్రెడీ కితకితలు మూవీలో స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసారికి అల్లరి నరేష్ గారు ఎగిరిపోయారు ఇక బిగ్ బాస్ లో ఉండేదే చిన్న స్విమ్మింగ్ పూల్ అందులో నేను దూకితే మిగతా వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు వాళ్లకు ఎలా సరిపోతుంది. మిగతా వాళ్ళు పారిపోడానికి కూడా లేదు. గేట్స్ మూసేస్తారు కదా. నాగార్జున గారు వింటున్నారా సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయిస్తే ఓకే. నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ గా ఉంటుంది.
ఆయన్ని చూడగానే ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని చూసా కానీ దగ్గరకు వెళ్లి ఎప్పుడూ మాట్లాడలేదు. బిగ్ బాస్ ఆఫర్ వస్తే ముందు వెళ్లి నాగార్జున గారికి ముద్దు పెట్టేసి ఆ తర్వాత మాట్లాడతా. రీసెంట్ గా కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు షోస్ కి ఎవరూ రావడం లేదు అని అడిగితె బిగ్ బాస్ చూస్తున్నారు అని చెప్పారు. పల్లెటూళ్లలో కూడా ప్రతీ ఒక్కరూ బిగ్ బాస్ చూస్తున్నారు. ప్రతీ నార్మల్ పీపుల్ కి ఈ షో రీచ్ అవుతుంది. పెద్ద స్క్రీన్ మాత్రమే కాదు చిన్న స్క్రీన్ మీద కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. నాకు వంట రాదు..ఎవరో ఒకరు చేసి ఇస్తారు ఐనా జ్యూస్ లు ఏర్పాటు చేస్తే చాలు. బాత్ రూమ్స్ క్లీనింగ్ అవన్నీ క్లీన్ చేస్తామా ఏంటి..ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేనే కొట్టేస్తా...దాంతో వాళ్ళు నా జోలికి రారు. వాళ్ళే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. తర్వాత రాజ్యం మొత్తం మనమే ఏలేది." అంటూ చెప్పుకొచ్చింది గీతా సింగ్.
![]() |
![]() |